
పోక్సో కేసులో వ్యక్తికి రిమాండ్
ముదిగుబ్బ: నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు .. ముదిగుబ్బకు చెందిన ఓ బాలికపై అత్యాచారం చేసినట్లు మంగళవారం బయటపడిందన్నారు. అదే రోజు అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం బాలికను నమ్మించి మోసం చేసి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాలిక గర్భవతి అయినట్లు తెలియడంతో రాజేష్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పీఏబీఆర్ సందర్శన
కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్)ను గురువారం జల్శక్తి అభియాన్ సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు గౌతమ్, డిప్యూటీ డైరెక్టర్ శంకర్ సందర్శించారు. డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం ఎంత.. ఎక్కడి నుంచి నీరు సరఫరా అవుతోంది.. ఎలా వినియోగిస్తు న్నారు తదితర అంశాలపై ఇరిగేషన్ అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఈఈ శశిరేఖ మాట్లాడుతూ డ్యాం కెపాసిటీ 11 టీఎంసీలని పేర్కొన్నారు. తుంగభద్ర, జీడిపల్లి జలాశయాల నుంచి కాలువల ద్వారా, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి నప్పుడు వరద రూపంలో నీరు వచ్చి డ్యాంలో చేరుతుందని వివరించారు. ఇప్పటి వరకు సుమారు 5.5 టీఎంసీల నీరు నిల్వ ఉంచామన్నారు. సత్యసాయి, అనంతపురం, శ్రీరామిరెడ్డి, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వందలాది గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతున్నట్లు చెప్పారు. ధర్మవరం కుడి కాలువ ద్వారా 49 చెరువులకు నీటిని సరఫరా చేస్తామని తద్వారా ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందుతోందన్నారు. డ్యాం వద్ద ఏర్పాటైన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీకి నీటిని వినియోగిస్తామన్నారు. ప్రస్తుతం అవుట్ ఫ్లో 120 క్యూసెక్కులున్నట్లు కేంద్ర బృందానికి వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈఈలు వెంకటరమణ,ఉదయ సేనయ్,ఏఈఈలు లక్ష్మీదేవి, రామకృష్ణ, ముత్యాలప్ప, శాస్త్రి, గంగమ్మ, వెంకటరమణ, రేణుక పాల్గొన్నారు.

పోక్సో కేసులో వ్యక్తికి రిమాండ్