
ఆదరణ ఓర్వలేకనే ఆరోపణలు
రొద్దం: ఏప్రాంతానికి వెళ్లినా.. ప్రజల నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వ పెద్దలు ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విమర్శించారు. గురువారం సాయంత్రం మండల పరిధిలోని ఎం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ‘కాఫీ విత్ వైఎస్సార్సీపీ లీడర్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉషశ్రీచరణ్ విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు పోటెత్తుతుండటం అందరం చూస్తూనే ఉన్నామన్నారు. ఆయనకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక హోం మంత్రి అనిత ప్రెస్మీట్ పెట్టిన జగన్పై, వైఎస్సార్సీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. శాంతిభద్రలకు విఘాతం కల్పించేందుకు వైఎస్సార్సీపీ నేతలు బయటకు వస్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దళిత బాలికపై అత్యాచారం జరిగితే హోంమంత్రిగా ఉండి ఇంత వరకూ స్పందించకపోవడం దారుణమన్నారు. అలాగే ఓ గిరిజన యువతి అదృశ్యమైయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఐదు రోజుల తరువాత అమ్మాయి శవమై కనిపించిందన్నారు. ఇంతవరకూ బాధిత కుటుంబాలను పరామర్శిచించి ప్రభుత్వం తరుఫున ఆర్థిక సాయం ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ మహిళను టీడీపీ నాయకులు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన చూస్తే రాజ్యాంగం ఎక్కడుందని ప్రశ్నించారు. హోం మంత్రిగా మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి జగన్పై బురద జల్లడం పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కురుబ గీతా, మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, నాయకులు ఎన్ నారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, నరేంద్రరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, జెట్టి శ్రీనివాస్రెడ్డి, వీరేష్, మాజీ సర్పంచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
జగనన్నపై పనిగట్టుకొని
బురదజల్లుతున్నారు
మహిళలపై జరుగుతున్న
అఘాయిత్యాలపై హోంమంత్రి
స్పందించరా?
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్