
కేసులు ఎత్తేయాలని ధర్నా
సైదాపురం: ఊటుకూరు దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, దళితుల భూములకు యాజమాన్య హక్కులు కల్పి ంచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కన్వీనర్ డీపీ పోలయ్య డిమాండ్ చేశారు. ఆయన గురువారం దళితులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఊటుకూరు సమీపంలో సర్వే నంబర్ 359, 356లో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలని కోరారు. అలాగే భూస్వాములు, పెత్తందారుల ఆక్రమణలో ఉన్న బంజరు, మిగులు, పోరంబోకు భూములను స్వాధీ నం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులపై పెట్టిన కేసులు ఎత్తి వేసేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని హెచ్చరించారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రమేష్, వెంకటయ్య, మమత, కోటయ్య, అంకయ్య తదితరులు పాల్గొన్నారు.