విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Sep 22 2023 12:20 AM | Updated on Sep 22 2023 12:20 AM

పవన్‌ కుమార్‌ మృతదేహం 
 - Sakshi

పవన్‌ కుమార్‌ మృతదేహం

మనుబోలు: మండలంలోని వీరంపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షాక్‌తో ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. వినాయక చవితి సందర్భంగా గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి రోజూ పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నలగర్ల పవన్‌ కుమార్‌ (30) అనే వ్యక్తి ప్రసాదాలు తీసుకోవాలని మైక్‌లో చెబుతున్నాడు. ఈ సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. పవన్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement