భార్య కోసం మొదటిసారి కోహ్లి ఏంచేశాడంటే..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఆఫ్ ఫీల్డ్ నైపుణ్యాలను బాగా పెంచుకుంటున్నారు. అంతటితో ఆగక ఆ ఆనంద క్షణాలను అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే తాజాగా మయాంక్ అగర్వాల్తో సరదాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ పుట్టిన రోజున భార్య కోసం తానే కేక్ తయారు చేసినట్లు కోహ్లి వెల్లడించారు. అయితే కేక్ తయారుచేయడం తన జీవితంలో మొదటి ప్రయత్నం అని.. అయితే ఆ ప్రయత్నం ఫలించి కేక్ మంచిగానే వచ్చినట్లు తెలిపారు. అనుష్క శర్మ నుంచి కూడా కేక్ బాగుంది. ఈ కేక్ నాకు చాలా ప్రత్యేకమైనది' అనే కాంప్లిమెంట్స్ వచ్చినట్లు విరాట్ కోహ్లి మయాంక్ అగర్వాల్తో అన్నారు. (అలా ఆ సమస్యను అధిగమించా: కోహ్లి)
From baking for his special someone in the lockdown to revealing the best smoothie makers in the team, @imVkohli answers it all on #OpenNetsWithMayank.
Part 2 of the show coming up soon on https://t.co/Z3MPyesSeZ. Stay tuned 😊😊@mayankcricket pic.twitter.com/IuvdfOST0Y
— BCCI (@BCCI) July 26, 2020
కాగా.. టీమిండియా క్రికెటర్లలో ఉత్తమ ప్రొటీన్ షేక్లను తయారుచేసే వారి గురించి మయాంక్ అడిగినపుడు.. విరాట్ సమాధానంగా మయాంక్ అగర్వాల్, నవదీప్ షైనీ, తన పేరు చెప్పాడు. ఆ వెంటనే మీరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు. మొదటి మిమ్మల్ని, తర్వాత నవదీప్ షైనీని, ఆ తర్వాత నాకు నేను రేటింగ్ ఇచ్చుకుంటాను' అంటూ కోహ్లి సమాధానమిచ్చారు. అయితే లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన కోహ్లి రెగ్యులర్ ఫిట్నెస్ను కాపాడుకోవడంతోపాటు, పుస్తకాలు చదవడం, కుటుంబంతో వీలైనంత సమయాన్ని గడపడం ద్వారా కరోనా కాలంలో తనను తాను బిజీగా ఉంచుకుంటున్నాడు. ఇక 2020లో ఐపీఎల్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుండటంతో.. ఈ సీజన్లో అయినా రాయల్ ఛాలెంజర్స్ జట్టును విజేతగా నిలపాలనుకుంటున్నాడు. గత 12 సీజన్లలోనూ బెంగళూరు జట్టుకు నిరాశే ఎదురైన సంగతి తెలిసిందే. (ముగింపు బాగుండాల్సింది: అనిల్ కుంబ్లే)
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు