WTC FINAL 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు మరో బిగ్‌షాక్‌!

R Ashwin misses PBKS vs RR clash with back injury ahead of WTC Final - Sakshi

ఆస్ట్రేలియాతో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోం‍ది. ఈ గాయాల జాబితాలోకి భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ కూడా చేరాడు. అశ్విన్‌ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌-2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన రాజస్తాన్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని టాస్‌ సమయంలో రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ తెలిపాడు. అశ్విన్‌ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని, అందుకే ఆఖరి నిమిషంలో తమ జట్టులో మార్పు చేశామని శాంసన్‌ వెల్లడించాడు.

ఇక ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ గాయాల కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం కాగా.. తాజాగా అశ్విన్‌ కూడా గాయం బారిన పడడం భారత జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.  జూన్‌ 7నుంచి లండన్‌ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు:  రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, కెఎస్ భరత్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కట్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top