రెండు జట్లకు చివరి అవకాశం

Pro Kabaddi League Eliminator Match Dream 11 Tips Puneri Paltan - Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌ చివరి దశకు చేరుకుంది. నేడు రెండు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో యూపీ యోధతో పుణేరి పల్టన్‌; రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ తలపడతాయి. నెగ్గిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఓడిన రెండు జట్లు నిష్క్రమిస్తాయి. లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పట్నా పైరేట్స్, దబంగ్‌ ఢిల్లీ జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. సెమీఫైనల్స్‌ 23న, ఫైనల్‌ 25న జరుగుతాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top