Breadcrumb
Live Updates
IPL 2022: పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ లైవ్ అప్డేట్స్
గుజరాత్ టైటాన్స్ను గెలిపించిన రాహుల్ తెవాటియా
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆఖరి రెండు బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో రాహుల్ తెవాటియా రెండు సిక్స్లు కొట్టి జట్టును గెలిపించాడు. అంతకముందు శుబ్మన్ గిల్ 96 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. హార్దిక్ పాండ్యా 27 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ 2, రాహుల్ చహర్ ఒక వికెట్ తీశాడు. కాగా గుజరాత్ టైటాన్స్కు ఇది హ్యాట్రిక్ విజయం కావడం విశేషం.
గిల్, హార్దిక్ పాండ్యా ఔట్.. గుజరాత్ 172/4
గుజరాత్ టైటాన్స్ వరుస ఓవర్లలో గిల్(96), పాండ్యా(27) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. విజయానికి 4 బంతల్లో 17 పరుగులు చేయాల్సి ఉంది.
సాయి సుదర్శన్ (35) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
నిలకడగా ఆడుతున్న సాయి సుదర్శన్(35) రాహుల్ చహర్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. గిల్ 89, హార్దిక్ పాండ్యా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
గిల్ దూకుడు.. గుజరాత్ 128/1
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్మన్ గిల్ విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడు. 48 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 84 పరుగులతో ఆడుతున్న గిల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. సాయి సుదర్శన్ 35 పరుగులతో గిల్కు సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం గుజరాత్ వికెట్ నష్టానికి 128 పరుగులు చేసింది.
ధాటిగా ఆడుతున్న గుజరాత్.. 9 ఓవర్లలో 88/1
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. గిల్ 58, సాయి సుదర్శన్ 23 పరుగులతో ఆడతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన మాథ్యూ వేడ్ రబాడ బౌలింగ్లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. గిల్ 25, సాయి సుదర్శన్ 5 పరుగులతో ఆడుతున్నారు.
పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 190
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లివింగ్స్టోన్ 27 బంతుల్లో 64 పరుగలుతో విధ్వంసం సృష్టించగా.. ధావన్ 35 పరుగులు చేశాడు. ఆఖర్లో రాహుల్ చహర్ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 22 పరుగులు చేయడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, దర్శన్ నల్కండే 2, పాండ్యా, ఫెర్గూసన్, షమీ తలా ఒక వికెట్ తీశారు.
రెండు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు డౌన్.. పంజాబ్ స్కోరెంతంటే
పంజాబ్ కింగ్స్ రెండు ఓవర్ల వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రాహుల్ చహర్ 4, వైభవ్ అరోరా ఒక్క పరుగుతో ఆడుతున్నారు.
14 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 134/5
14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లియామ్ లివింగ్స్టోన్ 59, షారుక్ ఖాన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు.
ధావన్(35) ఔట్.. పంజాబ్ కింగ్స్ 100/3
12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. లివింగ్స్టోన్ 39, జితేష్ శర్మ 10 పరుగులతో ఆడతున్నారు. అంతకముందు ధావన్(35) పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు.
బెయిర్ స్టో(8) ఔట్.. రెండో వికెట్ డౌన్
జానీ బెయిర్ స్టో(8) రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్లో రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న బెయిర్ స్టో నిరాశ పరిచాడు. ప్రస్తుతం పంజాబ్ 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. ధావన్ 27, లివింగ్ స్టోన్ 5 పరుగులతో ఆడుతున్నారు.
4 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 25/1
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. ధావన్ 11, బెయిర్ స్టో 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఐదు పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య శుక్రవారం ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి సూపర్ ఫామ్లో ఉండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచి.. ఒక మ్యాచ్ ఓడింది.
Related News By Category
Related News By Tags
-
ముంబై మురిపించేనా!
ఎనిమిదేళ్ల వ్యవధిలో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచి సంచలనం సృష్టించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమవుతోంది. గత ఐదు సీజన్లలో కనీసం ఒక్కసారీ ఫైనల్ చేరలేకపోయిన హార్దిక్ పాండ్యా...
-
IPL 2026: వేలకోట్లు వదులుకున్న రాజస్థాన్
ఐపీఎల్ ప్రారంభ సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్కు గురి చేస్తోంది. ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను అమ్మకాలకు ప్రక్రియ ప్రారంభమైన సం...
-
‘సంజూకు మామయ్యలాంటి వాడిని’
భారత జట్టు స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను తర్వాతి ధోనీగా పోల్చాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. ఇటీవల తమ మధ్య జర...
-
24 ఏళ్ల తర్వాత మ్యాచ్.. సంచలనం రిపీటయ్యేనా?
భారత మహిళల జట్టు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడనుండడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే 24 ఏళ్ల కిందట మహిళల జట్టు సౌతాఫ్రికాలో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ...
-
‘అతడి వెంటపడొద్దు.. స్వేచ్ఛనివ్వండి’
వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. పసిప్రాయంలోనే దూకుడైన ఇన్నింగ్స్లతో ప్రత్యర్థులను వణికించిన 15 ఏళ్ల సూర్యవంశీ ఏడాది కాలంగా అండర్-19 క్రికెట్లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవలే ...


