సిద్దిపేటజోన్: పిల్లలు ఎలా ఉన్నారు.. వసతులు ఎలా ఉన్నాయి? బాగా చదువుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సౌజన్య ఆప్యాయంగా పలకరించారు. మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ ఆదేశాల మేరకు స్థానిక బాలసదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల యోగక్షేమాలు, విద్య, వసతుల గూర్చి ఆరా తీసి, చట్టాలపై అవగాహన కల్పించారు. చదువు ప్రాముఖ్యత గూర్చి వివరించారు. అలాగే శిశు గృహాన్ని సందర్శించి పిల్లలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలకు పండ్లు అందజేశారు.


