క్షణికావేశంలో విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. హత్యలు చేయడం సరికాదు. సమస్యకు ఇది పరిష్కారం కాదు. తెలిసిన సర్కిల్లోనే హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. హత్యలు చేయడం వల్ల జైలు, మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ అనిత, సైక్రియాట్రి విభాగం హెడ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, సిద్దిపేట
వ్యక్తిగత వివరాలు షేర్ చేయవద్దు
భూంపల్లిలో మహిళ చేసిన హత్యకు సంబంధించిన విషయాలు చూస్తే షాక్ అయ్యాం. వ్యక్తిగత విషయాలను బయటి వారితో షేర్ చేసుకోవద్దు. భద్రత కోసమే కాలనీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాం. సీసీ కెమెరాల ద్వారానే కేసును ఛేదించాం.
– రష్మీ పెరుమాళ్, సీపీ


