సిద్దిపేటజోన్: జ్యూట్ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహిద్దామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంతో పర్యావరణ పరిరక్షణకు దోహదపడుదామని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు రవీందర్లు అన్నారు. శుక్రవారం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో జ్యూట్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్లాస్టిక్ వాడకం, దాని పర్యావసానంపై వివరించారు. జ్యూట్ బ్యాగ్స్ వాడాలని సూచించారు. స్టీల్ పాత్రలను వినియోగించుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో వ్యాపారులు, ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.


