
ధాన్యం డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతులు
తొగుట(దుబ్బాక): పొద్దు తిరుగుడు ధాన్యం విక్రయించి 75 రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తొగుట సెంటర్ పరిధిలో 400 మంది రైతులకు గానూ రూ.3 కోట్లకుపైగా బకాయిలున్నాయన్నారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
రోడ్డుపై బైఠాయించిన రైతులు