
ఆయిల్పామ్ సాగుకు ముందుకు రావాలి
గజ్వేల్రూరల్: మండల పరిధిలోని పలు ఆయిల్పామ్ తోటలను కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా మండలంలోని బూర్గుపల్లి, అక్కారం గ్రామాల్లోని ఆయిల్పామ్ తోటలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో 66,546 మొక్కలు నాటేందుకు చర్యలు చేపడతున్నామన్నారు. అయితే ఇప్పటి వరకు 12,339 ఎకరాల్లో ఆయిల్ఫామ్ సాగవుతున్నట్లు తెలిపారు. 329 మంది రైతులు 322.83టన్నుల ఆయిల్పామ్ దిగుబడి సాధించారన్నారు. జిల్లాలోని మిరుదొడ్డి మండలం చెప్యాలలో, మర్కూక్ మండలాల్లో ఆయిల్పామ్ గెలల కొనుగోలు కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలో నంగునూరు, నర్మెట్టలో ఏర్పాటు చేస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం టన్ను ఆయిల్పామ్ గెలల ధర రూ.21000 వరకు ఉందని, రైతులు పంట సాగుచేసేందుకు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పొన్నుస్వామి, అదనపు డైరెక్టర్(హార్టికల్చర్) సరోజినిదేవి, జిల్లా ఉద్యాన శాఖాధికారి సువర్ణ, అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
వేసవిలో ఎక్కువ నీరు అందించాలి
కొమురవెల్లి(సిద్దిపేట): వేసవిలో ఆయిల్పామ్ మొక్కలకు ఎక్కువ నీరు అందించాలని డైరెక్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డాక్టర్ పొన్నుస్వామి సూచించారు. బుధవారం మండలంలోని గురువన్నపేటలో పలు అయిల్పామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్లో అంతరపంటగా అరటి, మునగ వేసుకోవడం వల్ల మొదటి మూడేళ్లు మంచి లాభాలు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యన శాఖ అదనపు డైరెక్టర్ సరోజిని దేవి, జిల్లా అధికారి సువర్ణ, అయిల్ఫెడ్ జిల్లా ఇన్చార్జి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో తోటలను సందర్శించిన కేంద్ర బృందం