
అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలు
డీఎంహెచ్ఓ పల్వన్కుమార్
సిద్దిపేటకమాన్: కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో అవసరమైన వారికి రోజూ 20మందికి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విమలాథామస్, డీఎంహెచ్ఓ డాక్టర్ పల్వన్కుమార్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ సర్జరీలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. గర్భిణులకు ఆరోగ్య వైద్య సేవల నిమిత్తం 102 వాహనం ద్వారా ఇంటి నుంచి ఆస్పత్రికి, తిరిగి ఇంటికి తీసుకెళ్లాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, సైకియాట్రిక్ విభాగ హెచ్ఓడీ డాక్టర్ శాంతి, ఆర్ఏంఓలు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.