చిరుధాన్యాలతోనే ఆరోగ్యసిరి | - | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాలతోనే ఆరోగ్యసిరి

Apr 12 2025 8:52 AM | Updated on Apr 12 2025 8:52 AM

చిరుధాన్యాలతోనే ఆరోగ్యసిరి

చిరుధాన్యాలతోనే ఆరోగ్యసిరి

వర్గల్‌(గజ్వేల్‌): సామలు, అరికెలు తదితర చిరుధాన్యాలతో కూడిన పోషకాహారం మాతాశిశువులకు ఎంతో ప్రయోజనకరమని సీడీపీఓ సరిత అన్నారు. శుక్రవారం వర్గల్‌ మండలం నెంటూరు అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ హరితతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశువులకు పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ సునీత, అంగన్‌వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement