రైతులను ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

Apr 10 2025 7:13 AM | Updated on Apr 10 2025 7:13 AM

రైతుల

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక: ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు మున్సిపాలిటీలోని చేర్వాపూర్‌, చెల్లాపూర్‌ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పీఎసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు కై లాసం, నరేష్‌, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనిత భూంరెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎల్లారెడ్డి, ఏఓ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

రాజ్యాంగ పరిరక్షణకు కృషి

డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి

గజ్వేల్‌: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ‘జై బాపు జై భీమ్‌, జై సంవిధాన్‌’కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు దక్కాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సంవిధాన్‌ పాదయాత్ర సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, నాయకులు సమీర్‌, మొనగారి రాజు, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

బెట్టింగ్‌లకు పాల్పడితే

కఠిన చర్యలు: సీపీ అనురాధ

సిద్దిపేటకమాన్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట సీపీ అనురాధ హెచ్చరించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరైనా క్రికెట్‌, ఇతర బెట్టింగ్‌లకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. యువత బెట్టింగ్‌ యాప్‌ల మోజులో పడి బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు. అప్పుల చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. బెట్టింగ్‌ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బెట్టింగ్‌పై సమాచారం తెలిస్తే డయల్‌ 100 లేదా పోలీసు కంట్రోల్‌ రూం నంబర్‌ 8712667100కు సమాచారం అందించాలని సూచించారు.

వాటర్‌ షెడ్‌ పథకం

వినియోగించుకోవాలి

డీఆర్‌డీఏ పీడీ జయదేవ్‌ ఆర్య

చిన్నకోడూరు(సిద్దిపేట): వాటర్‌ షెడ్‌ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్‌డీఏ పీడీ జయదేవ్‌ ఆర్య సూచించారు. బుధవారం మండల పరిధిలోని చౌడారం గ్రామంలో పర్యటించి వాటర్‌ షెడ్‌ పథకం గురించి ప్రజలకు వివరించారు. ఈ పథకంపై 16న గ్రామంలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పనుల పరిశీలన, కొత్త పనులు ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. చౌడారంతోపాటు సమీప గ్రామాల ప్రజలు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జనార్దన్‌, ఎంపీఓ సోమిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు1
1/3

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు2
2/3

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు3
3/3

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement