జహీరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్ను పరామర్శించారు. శివకుమార్ తండ్రి ఈశ్వరయ్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న హరీశ్రావు ఆదివారం జహీరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న శివకుమార్ను హరీశ్రావు ఓదార్చారు. ఎమ్మెల్యేలు కె.మాణిక్రావు, చింతా ప్రభాకర్, ఆయా కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవిప్రసాద్, వై.నరోత్తం, ఎం.డి.తన్వీర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, భిక్షపతిలతోపాటు ఆయా పార్టీల నాయకులు శివకుమార్ను పరామర్శించారు.


