జిన్నారం(పటాన్చెరు): గుమ్మడిదల పట్టణ పరిధిలోని అన్నారం సమీపంలోని సర్వే నంబర్ 331లోని అసైన్డ్ భూముల్లో అక్రమ ఇట్టికబట్టీల నిర్వహణపై రెవెన్యూ అధికారులు చర్యలకు దిగారు. రెవెన్యూ అధికారి ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇటుక బట్టీల నిర్వాహకులు పెద్దఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఫిర్యాదులపై ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. అనుమతులకు విరుద్ధంగా ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.


