యోగా డేను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

యోగా డేను విజయవంతం చేయాలి

Jun 20 2025 6:51 AM | Updated on Jun 20 2025 6:51 AM

యోగా డేను విజయవంతం చేయాలి

యోగా డేను విజయవంతం చేయాలి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు/జిన్నారం (పటాన్‌చెరు): అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 21న శనివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పటాన్‌చెరు డివిజన్‌లోని మైత్రి మైదానంలో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో ప్రతీ ఒక్కరూ పాల్గొనవచ్చని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులు, యోగా నిర్వహణ కమిటీ సభ్యులతో సమీక్షించారు. అంతకుముందు బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు రూ.37.50 లక్షల వ్యయంతో నిర్మించిన పాఠశాల అదనపు గదులను ప్రారంభించారు. అనంతరం మైత్రి మైదానంలో యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యోగ ప్రాముఖ్యతను ప్రతీ ఒక్కరికి తెలియజేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నామన్నారు. యోగా ద్వారా పరిపూర్ణమైన మానసిక సమతుల్యత ఏర్పడుతుందని మహిపాల్‌రెడ్డి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అదనంగా రూ.25 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో తరగతి గదులకు పెయింటింగ్‌, ఫ్లోరింగ్‌, బొమ్మలు, క్రీడా ప్రాంగణాలను ఆధునీకరించినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయనున్నామని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవో అరుణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాల్‌రెడ్డి, చంద్రారెడ్డి, హనుమంత్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement