
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి
ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అధికారులతో గురువారం నెలవారీ నేర సమీక్షను నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న నేరాల వివరాలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...అత్యాచార, పొక్సో కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్రణాళిక ఉండాలని సూ చించారు. అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్కు వచ్చిన వారికి భరోసా కల్పించాలని సూచించారు. వివిధ రకాల నేరాలను ఛేదించడంలో ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం సేవల ఆధారంగానే ఛేదించగలిగామన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన పోలీసులను అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ సమీక్షలో డీఎస్పీలు సత్తయ్యగౌడ్, ప్రభాకర్, సైదా నాయక్, వెంకట్రెడ్డితోపాటు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.