షెడ్డుకు మరమ్మతులు చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

షెడ్డుకు మరమ్మతులు చేపట్టండి

Apr 24 2025 8:47 AM | Updated on Apr 24 2025 8:47 AM

షెడ్డుకు మరమ్మతులు చేపట్టండి

షెడ్డుకు మరమ్మతులు చేపట్టండి

కంది(సంగారెడ్డి): డంప్‌యార్డు షెడ్డుకు మరమ్మతులు నిర్వహించి చెత్తసేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని డీపీఓ సాయిబాబా పంచాయితీ అధికారులకు సూచించారు. మండల పరిధిలోని బుధవారం కవలంపేటలోని డంప్‌యార్డు శిథిలావస్థలో ఉండటాన్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో శిథిలావస్థకు చేరిందన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం వేసవికాలం ఉన్నందున నీటి కొరత లేకుండా చూడాలన్నారు. అనంతరం పంచాయతీ రికార్డులను పరిశీలించి నిర్వహణ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎల్పీఓ అనిత, ఎంపీఓ మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

డీపీఓ సాయిబాబా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement