ప్రజాభిమానం మరవలేను | - | Sakshi
Sakshi News home page

ప్రజాభిమానం మరవలేను

Apr 22 2025 7:04 AM | Updated on Apr 22 2025 7:04 AM

ప్రజా

ప్రజాభిమానం మరవలేను

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌

సంగారెడ్డి: ప్రజల అభిమానం ఎన్నటికీ మర్చిపోలేనని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అన్నారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే తన జన్మదిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్‌ కట్‌ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందోల్‌ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, జైపాల్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన వేతన ఒప్పందం

మాతోనే సాధ్యం

సీఐటీయూ అధ్యక్షుడు చుక్క రాములు

జహీరాబాద్‌ టౌన్‌: మెరుగైన వేతన ఒప్పందం సీఐటీయూతోనే సాధ్యమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మహీంద్ర కార్మిక సంఘం అధ్యక్షుడు చుక్కరాములు అన్నారు. పట్టణ సమీపంలో గల మహీంద్ర అండ్‌ మహీంద్ర పరిశ్రమలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహీంద్రలో త్వరలో కార్మిక సంఘం ఎన్నికలు రాబోతున్నాయని, సీఐటీయూను గెలిపించాలని కోరారు. వేతన ఒప్పందం, ఉద్యోగ భద్రత, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బలపరచాలని కోరారు. ఈ నెల 20న దేశవ్యాప్త స్వారత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేశం, జహీరాబాద్‌ క్లస్టర్‌ కన్వీనర్‌ ఎస్‌.మహిపాల్‌, యూనియన్‌ నాయ కులు నరేష్‌ ఉమామహేశ్వరరావు, కిరణ్‌, బాలరాజు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు సన్మానం

మునిపల్లి(అందోల్‌): అంగన్‌వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని పై తరగతులకు వెళ్తున్న చిన్నారులకు టీచర్లు మంజుల, శకుంతల సన్మానించారు. సోమవారం మండలంలోని పెద్దగోపులారంలో ఆంగన్‌వాడీ కేంద్రంలో వార్షికోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్‌, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్‌రావు, ఉపాధ్యాయ బృందం, సూపర్‌ వైజర్‌ శైలజ తదితరులు పాల్గొన్నారు.

బడిబాట కరపత్రం ఆవిష్కరణ

కల్హేర్‌(నారాయణఖేడ్‌): సిర్గాపూర్‌ మండలం ఖాజాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఎంఈఓ నాగరం శ్రీనివాస్‌ సోమవారం బడిబాట కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మారుతి, టీచర్లు శ్రీకాంత్‌, భాస్కర్‌, సీఆర్‌పీ శివకుమార్‌, విద్యార్థుల తల్లిదండ్రులు తుకారాం, రాంకిషన్‌, సాయిలు, మాశ్నప్ప ఉన్నారు.

బేతాళ స్వామికి ప్రత్యేక పూజలు

మునిపల్లి(అందోల్‌): బేతాళ స్వామికి మాజీ ఎంపీపీ రాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం మండలంలోని మేళసంగ్యం, మగ్దుంపల్లి, కంకోల్‌ శివారులో బేతాళ స్వామి జాతర మహోత్సవంం ఘనంగా నిర్వహించారు. మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీపీ రాంరెడ్డితో పాటు కాంగ్రెస్‌ నాయకులకు మగ్దుంపల్లి కాంగ్రెస్‌ నాయకులు శాలువా కప్పి సన్మానించారు.

ప్రజాభిమానం మరవలేను
1
1/3

ప్రజాభిమానం మరవలేను

ప్రజాభిమానం మరవలేను
2
2/3

ప్రజాభిమానం మరవలేను

ప్రజాభిమానం మరవలేను
3
3/3

ప్రజాభిమానం మరవలేను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement