
బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
యువకుడు మృతి, మరో యువకుడికి తీవ్ర గాయాలు
వట్పల్లి(అందోల్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని కిచ్చన్నపల్లి గ్రామానికి చెందిన మద్దూరి అనిల్ కుమార్ (25)కుమ్మరి అనిల్ కుమార్ (26) బైక్పై కిచ్చనపల్లి గ్రామానికి వెళ్తున్నారు. అన్నాసాగర్ చెరువుకట్ట వద్దకు రాగానే నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మద్దూరి అనిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా , మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జోగిపేట పోలీసులు కేసు నమోదు చేశారు.