సంగారెడ్డి : ఉమ్మడి జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు ఇవ్వడంతో డీసీసీబీకి రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. ఈ మేరకు హైదారాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి భవనంలో శుక్రవారం మంత్రి సీతక్క చేతుల మీదుగా డీసీసీబీ సీఈఓ శ్రీనివాస్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ మేరకు శనివారం మంత్రి దామోదర రాజనర్సింహను చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, సీఈఓ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీసీసీబీ పాలక వర్గంతో పాటు అధికారులను మంత్రి అభినందించారు. 2023 –24 ఆర్థిక సంవత్సరానికి గాను ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ద్వారా 7,500 స్వయం సహాయక సంఘాలకు రూ.450 కోట్ల బ్యాంక్ లింకేజి రుణాలను అందజేశారు. రాష్ట్రంలోని అన్ని డిసిసిబి బ్యాంకులతో పోలిస్తే అత్యధికంగా రుణాలు ఇచ్చిన ఉత్తమ బ్యాంకుగా అవార్డు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment