మెరుగైన పరిహారం అందేలా చూడండి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన పరిహారం అందేలా చూడండి

Aug 30 2026 7:24 AM | Updated on Aug 30 2026 7:24 AM

యాచారం: శివన్నగూడెం ప్రాజెక్టు కింద వ్యవసాయ భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.60 లక్షలకు పైగా పరిహారం అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మంతన్‌గౌరెల్లి రైతులు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్‌ కొర్ర అరవింద్‌నాయక్‌ ఆధ్వర్యంలో గురువారం గ్రామ రైతులు తొర్రూర్‌ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. శివన్నగూడెం రిజర్వాయర్‌ కింద శ్రీమంతగూడ రెవెన్యూ పరిధిలోని 120 ఎకరాలకు పైగా మంతన్‌గౌరెల్లి రైతుల వ్యవసాయ భూములు పోతున్నాయని తెలిపారు. గతంలో ఎకరాకు రూ.28 లక్షల పరిహారం చెల్లిస్తామని చెప్పారని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో వ్యవసాయ భూములు ఎకరాకు రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షలకు పైగా డిమాండ్‌ ఉందన్నారు. భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.60 లక్షలకు పైగా పరిహారం చెల్లించేలా, ఎకరాకు 121 గజాల ప్లాటు దక్కేలా చూడాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement