అధికార మార్పు అవసరం | - | Sakshi
Sakshi News home page

అధికార మార్పు అవసరం

Nov 27 2023 7:10 AM | Updated on Nov 27 2023 7:10 AM

తుక్కుగూడలో ప్రచారం చేస్తున్న రామచంద్రయ్య యాదవ్‌  - Sakshi

తుక్కుగూడలో ప్రచారం చేస్తున్న రామచంద్రయ్య యాదవ్‌

తుక్కుగూడ: రాష్ట్రంలో మార్పు కోసమే భారత చైతన్య పార్టీ (బీసీవై) పోటీ చేస్తుందని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు బి.రామచంద్రయ్య యాదవ్‌ అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థి కుంభం సురేశ్‌ యాదవ్‌కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యాదవ్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నుంచి సబితారెడ్డి భూకజ్జాలు తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. ప్రజలు చెరుకు రైతు గుర్తు పై తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అభ్యర్థి కుంభం సురేశ్‌ యాదవ్‌, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌ యాదవ్‌, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్రయ్య యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement