● వివిధ సమస్యలపై 142 దరఖాస్తులు ● పెండింగ్లో పెట్టొద్దు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల అర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పలువురు బాధితులు కలెక్టరేట్కు తరలివస్తున్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజవాణికి భారీగా బాధితులు తరలివచ్చారు. ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి కలెక్టర్ స్వీకరించారు. వివిధ సమస్యలపై 142 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో పెట్టొద్దని సూచించారు. ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించాలన్నారు.
వేములవాడ మండలం ఫాజుల్నగర్లో మెయిన్రోడ్డులో నిర్మించిన శివాలయానికి తాటిచెట్లతో నష్టం జరుగుతుందని కలెక్టర్కు రజక సంఘం తప్పుడు ఫిర్యాదు చేశారు. గీతాకార్మికుల జీవనోపాధికి మూలమైన తాటిచెట్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలి. – గౌడ సంఘం, ఫాజుల్నగర్


