నీటి గంట అమలు చేయడం ద్వారా మా పాఠశాల విద్యార్థులు మరింత చురుగ్గా మారుతున్నారు. తరగతుల్లో ఎక్కువ ఏకాగ్రత చూపుతున్నారు. వారి అనారోగ్య కారణాలతో పాఠశాలకు రాకుండా ఉండే రోజులు కూడా తగ్గిపోయాయి.
– జె.అనురాధ, హెచ్ఎం, జిల్లెల్ల
నీరు తాగడం ఆరోగ్యదాయకం
పాఠశాల వేళల్లో తగినంత నీరు తాగడం ద్వారా పిల్లల కిడ్నీలు, రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధకశక్తి పెరగడం ద్వారా విద్యార్థులు అనేక అనారోగ్యాల నుంచి సురక్షితంగా ఉంటారు.
– డాక్టర్ రజిత,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, సిరిసిల్ల


