సిరిసిల్లటౌన్: జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరా రు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 17న చలో హైదరాబాద్కు వెళ్తున్న నేపథ్యంలో శుక్రవా రం ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్ను కలిసి మాట్లాడారు. కార్మికులపై పనిభారం తగ్గించాలని కోరారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ఎదుట ధర్నాకు వెళ్తున్న నేపథ్యంలో ముందస్తుగా లేఖను అందజేసినట్లు పేర్కొన్నారు. ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


