రన్నింగ్‌ బస్సులో నుంచి దూకేశాడు.. ఇక అంతే..! మీరైనా జర జాగ్రత్త..!! | - | Sakshi
Sakshi News home page

రన్నింగ్‌ బస్సులో నుంచి దూకేశాడు.. ఇక అంతే..! మీరైనా జర జాగ్రత్త..!!

Aug 11 2023 7:06 AM | Updated on Aug 11 2023 2:24 PM

- - Sakshi

రాజన్న: నడుస్తున్న బస్సులో నుంచి దూకి ఒకరు మృతిచెందిన సంఘటన గురువారం తంగళ్లపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సిరిసిల్లకు వస్తుండగా తంగళ్లపల్లికి చేరుకోగానే ఓ ప్రయాణికుడు హఠాత్తుగా రన్నింగ్‌ బస్సులో నుంచి దూకాడు.

తలకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికి తెలియకపోవడంతో ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement