రేషన్‌కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవాలి

May 11 2026 10:01 AM | Updated on May 11 2026 10:01 AM

రేషన్‌కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవాలి

మార్కాపురం టౌన్‌: రేషన్‌కార్డుల్లో ఉన్న సభ్యులంతా తప్పనిసరిగా ఈకైవెసీ చేయించుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి అంకయ్య అన్నారు. ఆదివారం నిర్వహించిన డీలర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా 10,15,212 కార్డులు ఉన్నాయని, అందులో 9,48,003 మంది ఈ కేవైసీ చేయించుకున్నారని, మిగిలిన వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకునేందుకు డీలర్లు కార్డుదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈకేవైసీ చేయించుకోకుంటే భవిష్యత్‌లో అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీనివాసులు, ఎన్‌ఫోర్సుమెంట్‌ డీటీ ఆర్‌ సాలమ్మ, రేషన్‌ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement