కోడి పందేలపై ఎస్పీ కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

కోడి పందేలపై ఎస్పీ కన్నెర్ర

Jan 11 2026 7:06 AM | Updated on Jan 11 2026 7:06 AM

కోడి పందేలపై ఎస్పీ కన్నెర్ర

కోడి పందేలపై ఎస్పీ కన్నెర్ర

కోడి పందేలపై ఎస్పీ కన్నెర్ర మాలకొండ శనివారం ఆదాయం రూ.9,43,012 వలేటివారిపాలెం: మండలంలోని మాలకొండలో ఉన్న మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆదాయం శనివారం రూ.9,43,012 వచ్చినట్లు ఆలయ ఈఓ ఎస్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కుంకుమార్చన ద్వారా రూ.24,280, తలనీలాలు రూ.20,600, ప్రత్యేక దర్శనం రూ.1,89,600, రూమ్‌ అద్దెలు రూ.26,360, లడ్డు ప్రసాదాలు రూ.1,67,660, అన్నదానం రూ.4,74,580, ఇతర విరాళాలు కలిపి ఆదాయం రూ.9,43,012 వచ్చినట్లు చెప్పారు.

ఒంగోలు టౌన్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కోడి పందేలకు బరులు సిద్ధం చేస్తున్న విషయంపై శనివారం ‘సాక్షి’ పత్రికలో వచ్చిన ‘పందెం కోడి – కయ్యానికి రెఢీ’ అనే కథనానికి ఎస్పీ హర్షవర్థన్‌ రాజు స్పందించారు. జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోడి పందేలు, పేకాట ఇతర జూదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాల్లో కోడి పందేలు, జూదాలు, గుండాట నిర్వహించడం నిషేధమని తేల్చి చెప్పారు. ఎవరైనా కోడి పందేలు ఆడినా, ప్రోత్సహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో కోడి పందేలను కట్టడి చేయడానికి పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో కోడి పందేల్లో పట్టుబడిన వ్యక్తులను బైండోవర్‌ చేయాలని, పందేలు ఉపయోగించే కత్తులు తయారు చేసే వారు, వాటిని సరఫరా చేసేవారు, పందెం నిర్వహించేందుకు స్థలాలను కేటాయించే వారిని గుర్తించాలన్నారు. పండుగ రోజు కోడి పందాలు జరిగే ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎక్కడైనా కోడి పందాలు జరుగుతున్న సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వాట్సప్‌ నంబర్‌ 9121102266కు తెలియజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement