నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి | - | Sakshi
Sakshi News home page

నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

Jan 9 2026 7:16 AM | Updated on Jan 9 2026 7:16 AM

నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

మద్దిపాడు: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులయ్యేందుకు కృషి చేయాలని పాఠశాల డైరెక్టర్‌ సుబ్బారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం ఉత్తీర్ణత పెంచేందుకే వంద రోజుల కార్యాచరణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులు సామర్థ్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యాశాఖ ఆడిషనల్‌ డైరెక్టర్‌ సుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement