చెక్‌డ్యాంలో పడి యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చెక్‌డ్యాంలో పడి యువకుడు మృతి

Jan 5 2026 7:35 AM | Updated on Jan 5 2026 7:35 AM

చెక్‌

చెక్‌డ్యాంలో పడి యువకుడు మృతి

చెక్‌డ్యాంలో పడి యువకుడు మృతి ఈతకోసం చెక్‌డ్యాంలో దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కొరిశపాడు మండలంలోని రాచపూడిలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. రాచపూడి ఎస్సీ కాలనీకి చెందిన పల్లి చినబాబు (20) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాచపూడి–పమిడిపాడు మధ్యలో ఉన్న చెక్‌ డ్యాం వద్దకు ఆదివారం ఈతకు వెళ్లారు. ఈతకోసం నీటిలో దిగిన ముగ్గురిలో చినబాబు నీటిలో మునిగిపోతున్న సమయంలో గమనించిన స్నేహితులు అతన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సమాచారాన్ని చినబాబు బంధువులకు అందచేశారు. కొరిశపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఈతగాళ్ల సహకారంతో చెక్‌డ్యాంలో పడిపోయిన చినబాబు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జాతీయస్థాయి జూడో పోటీలకు ఎంపిక తీరంలో సినిమా షూటింగ్‌ సందడి

మేదరమెట్ల:

జరుగుమల్లి(సింగరాయకొండ):

మండలంలోని కామేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థి కొత్తపల్లి నిఖిల్‌ జాతీయస్థాయి జూడో పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు ఎల్‌ అనూరాధ తెలిపారు. ఇటీవల అండర్‌–14 రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి గోల్డ్‌మెడల్‌ సాధించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పంజాబ్‌ రాష్ట్రంలోని లూథియానాలో జరగనున్న జాతీయస్థాయి జూడో పోటీల్లో పాల్గొంటాడని చెప్పారు. ఈ సందర్భంగా నిఖిల్‌ను, వ్యాయామ ఉపాధ్యాయుడు నర్రా కోటేశ్వరరావులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

చీరాల రూరల్‌:

చీరాల వాడరేవు తీరంలో ఆదివారం సినిమా షూటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా తీరంలో సందడి వాతావారణం నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సముద్రస్నానానికి తీరానికి తరలిరావడంతో షూటింగ్‌ ప్రాంతమంతా పర్యాటకులతో నిండిపోయింది. ఈ సినిమా విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపుదిద్దుకోనుందని డైరెక్టర్‌ భీంజి తెలిపారు. శ్రీసుధార క్రియేషన్స్‌ వారి మాస్టర్‌ కనిష్క సమర్పించే ఈ సినిమాలో అనంతనేని శ్రీనివాస్‌, మౌనిక శర్మ హీరో హీరోయిన్‌గా నటిస్తున్నారని, వీరిరువురికి ఇదే మొదటి సినిమా అని చెప్పారు. సినిమాలో నటీనటులుగా సుహాసిని మణిరత్నం, వినోద్‌కుమార్‌, ఇంద్రజ, శుభలేక సుధాకర్‌, అన్నపూర్ణమ్మ, తదితరులు ఉన్నట్లు చెప్పారు. కొరియోగ్రఫీ సంతోష్‌, బాలకృష్ణ, ఫైట్స్‌ రాజు, ప్రొడ్యూసర్‌గా పి.నాగరాజు వ్యవహరించనున్నారని తెలిపారు. చీరాల పరిసర ప్రాంతాల్లో ఈ నెల 13 వరకు షూటింగ్‌ చేయనున్నట్లు డైరెక్టర్‌ వెల్లడించారు.

చెక్‌డ్యాంలో పడి యువకుడు మృతి 
1
1/2

చెక్‌డ్యాంలో పడి యువకుడు మృతి

చెక్‌డ్యాంలో పడి యువకుడు మృతి 
2
2/2

చెక్‌డ్యాంలో పడి యువకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement