సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ షర్మిల ధ్వజం | YSRTP Chief YS Sharmila fires on Telangana CM KCR | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకలకు కరోనా అడ్డొచ్చిందా?

Jan 26 2023 5:09 AM | Updated on Jan 26 2023 5:09 AM

YSRTP Chief YS Sharmila fires on Telangana CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బహిరంగ సభలకు అడ్డురాని కరోనా గణతంత్ర వేడుకలకు అడ్డొచ్చిందని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌ రావు చెప్పడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎద్దేవా చేశారు.

భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న గౌరవం ఇదేనా అని నిలదీశారు. రాజ్యాంగాన్ని మార్చేయాలని చెప్పిన నాడే ఆయన దేశద్రోహి అని అర్ధమవుతుందన్నారు. గవర్నర్‌తో పడకుంటే గణతంత్ర వేడుకలను ఆపేస్తారా అని సూటిగా ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement