వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి అనాగరిక చర్య
పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు
చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు, అల్లరిమూకలకు ధైర్యం
ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపై జరిగిన దాడి ఇది
సాక్షి, గుంటూరు: హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి ఘటనను(Attack on Hindupur YSRCP Office) వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఖండించారు. ఇది వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదని.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారాయన.
వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అనుచరులు జరిపిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడి. కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఫర్నిచర్ను పగలగొట్టడం, అద్దాలను విరగ్గొట్టడం, కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. ఈ దాడిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఇది నిర్లక్ష్యం కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు నాయకత్వంలో దుర్వినియోగం చేస్తున్నారన్న హెచ్చరికగా భావించాలి. టీడీపీ హింసాత్మక చర్యలు, చంద్రబాబు నాయకత్వం మద్దతుతో గుంపుల ధారాళాన్ని ప్రోత్సహించడం, భయపెట్టి ప్రత్యర్థులను అణచివేయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపై ఈ దాడి జరిగినట్లే. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని తన ఎక్స్ ఖాతాలో దాడికి సంబంధించిన వీడియోతో సహా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.
The violent attack by TDP leaders and Balakrishna’s followers on the YSRCP office in Hindupur is a direct assault on democracy itself. We strongly condemn this barbaric act. When political parties start destroying offices, smashing furniture, breaking glass panes, and physically… pic.twitter.com/aFVgHXoRDl
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 15, 2025


