‘రెడ్డి పేరు మీద ఉన్న వారంతా నా బంధువులు కాదు’ | Telangana CM Revanth Reddy Slams KTR And BRS Party | Sakshi
Sakshi News home page

‘రెడ్డి పేరు మీద ఉన్న వారంతా నా బంధువులు కాదు’

Nov 12 2024 9:28 PM | Updated on Nov 12 2024 9:31 PM

Telangana CM Revanth Reddy Slams KTR And BRS Party

ఢిల్లీ:  రెడ్డి పేరు మీద ఉన్న వారంతా తన బంధువులు కాదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సృజన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ హయాంలోనే వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని, దీనిపై ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.

కలెక్టర్‌ దాడిపై సైతం సీఎం రేవంత్‌ స్పందించారు.  ‘ దాడులను తీవ్రంగా ఖండిస్తున్న. దాడుల వెనుక ఎంతవారు ఉన్నా ఊసలు లెక్క పెట్టాల్సిందే.  దాడులు చేయించిన వారిని చేసిన వారిని ఎవరిని వదలము. ఇలాంటి దాడులు బిఆర్ఎస్ పార్టీ జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా?,  అధికారులపై దాడులను బిఆర్ఎస్ ఎందుకు ఖండించదు. దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారు..అంటే దాడులను ప్రోత్సహించేందుకె పరామర్శలా?, 

కేటీఆర్ ఈ రేస్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీ వచ్చారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు ఉంటాయి. అవినీతి పార్టీ అయిన బిజెపిని అంతం చేస్తామన్న కేటీఆర్ ఇప్పుడు ఎలా బిజెపి నేతలను కలుస్తున్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని చెప్పడం బీజేపీకి సహకరించినట్లు కాదా? ’ అని రేవంత్‌ ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement