విద్యార్థుల ‘ఫీజు’ బకాయిలు విడుదల చేయండి | Telangana: BJP Chief Bandi Sanjay Demand Kcr To Release Fee Reimbursement Funds | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ‘ఫీజు’ బకాయిలు విడుదల చేయండి

Jun 7 2022 12:52 AM | Updated on Jun 7 2022 12:52 AM

Telangana: BJP Chief Bandi Sanjay Demand Kcr To Release Fee Reimbursement Funds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పేద విద్యార్థులకు వెంటనే రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమ వారం ఒక లేఖ రాశారు.  ఇంజనీరింగ్‌ కోర్సులో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కోసం ర్యాంకు నిబంధన ఎత్తివేయా లని కోరారు.

ఈ నెలాఖరులోపు నిధులు విడుదల చేయని పక్షం లో బీజేపీ ఆధ్వర్యంలో గాంధేయపద్ధతిలో ఆం దోళన కార్యక్రమాలు చేపడతా మని అన్నారు. గత రెండేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యా ర్థులకు బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల 14 లక్షలమంది  ఇబ్బందులకు గురవుతు న్నారని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement