జనసేన ఎమ్మెల్యే అవినీతిపై.. టీడీపీ నేతల ఫోన్‌కాల్‌ సంభాషణ వైరల్‌ | Phone Call Between Two TDP Leaders in Eluru District Goes Viral on Social Media | Sakshi
Sakshi News home page

జనసేన ఎమ్మెల్యే అవినీతిపై.. టీడీపీ నేతల ఫోన్‌కాల్‌ సంభాషణ వైరల్‌

Aug 1 2025 8:17 PM | Updated on Aug 1 2025 9:35 PM

Phone Call Between Two TDP Leaders in Eluru District Goes Viral on Social Media

సాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల ఫోన్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబుల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.

ఇరువురి సంభాషణలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతిపై చర్చకు వచ్చింది. ఈ చర్చలో ఏడాదిలోనే రూ.100 కోట్లు దోచేశారని దేవినేని ఉమా ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు ఇవన్నీ తెలుసా? అని రాంబాబును ఉమ ప్రశ్నించారు. అందుకు రాంబాబు స్పందిస్తూ .. ఇప్పటివరకు పవన్‌ నాకు ఫోన్‌ చేయలేదని అన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement