‘ఫోర్త్ సిటీ’ వెనుక కాంగ్రెస్ సర్కార్‌ భూదందా: బండి సంజయ్‌ | Bandi Sanjay Sensational Comments On Congress Government, More Details Inside | Sakshi
Sakshi News home page

‘ఫోర్త్ సిటీ’ వెనుక కాంగ్రెస్ సర్కార్‌ భూదందా: బండి సంజయ్‌

Aug 4 2024 7:07 PM | Updated on Aug 4 2024 7:32 PM

Bandi Sanjay Sensational Comments On Congress Government

సాక్షి, హైదరాబాద్‌: ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా కొనసాగుతోందని.. వేల ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర జరుగుతోందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం.. గుర్రంగూడలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.

మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి.. రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు.

ధరణిపై భూముల అన్యాక్రాంతంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసిన బండి సంజయ్‌.. ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చిందంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ భూదోపిడీపై చర్యలేవి?. కాంగ్రెస్‌కు హిందూ పండగలంటే అంత చులకనెందుకు?’’ అంటూ ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని.. ఆ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని వ్యాఖ్యానించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement