చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి

Jun 20 2025 6:41 AM | Updated on Jun 20 2025 6:41 AM

చట్టా

చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): ప్రతీఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీగల్‌ అథారిటీ సెక్రటరీ స్వప్నరాణి అన్నారు. మండలంలోని నీరుకుల్లలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అలాంటి పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలన్నారు. నిరుపేదలు ఉచిత న్యాయ సేవలను ఆయా కోర్టుల్లో ఉపయోగించుకోవచ్చని వివరించారు. న్యాయవాదులు శరత్‌కుమార్‌, భాను కృష్ణ, ఝాన్సీ, గ్రామ స్పెషల్‌ అధికారి సచిన్‌, కార్యదర్శి సునీత, గ్రామస్తులు పాల్గొన్నారు.

యోగా దినోత్సవాన్ని సక్సెస్‌ చేయాలి

బీజేపి జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి

పెద్దపల్లి రూరల్‌: ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐటీఐ గ్రౌండ్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట చక్రధర్‌ రెడ్డి, శ్రీనివాసరావు, గోపి, దిలీప్‌ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం

పెద్దపల్లిరూరల్‌: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం లభిస్తుందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు ఎం.చందన అన్నారు. పట్టణంలోని 8వ సెంటర్‌ తెనుగువాడలోని అంగన్‌వాడీ సెంటర్‌ను గురువారం ఆమె సందర్శించారు. ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పిల్లలకు ప్రీస్కూల్‌ విద్య, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణలో సేవలందిస్తున్నాయన్నారు. జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్‌, సీడీపీవో కవిత, సూపర్‌వైజర్‌ ప్రేమలత, టీచర్లు స్వరూప, రేఖ, రజిత, సుజాత పాల్గొన్నారు.

క్షయరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ముత్తారం: క్షయరహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని టీబీ అలర్ట్‌ ఇండియా జిల్లా పోగ్రాం అధికారి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మండలంలోని ఐదు సబ్‌ ఆరోగ్యకేంద్రాల్లో క్షయవ్యాధి గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రెండు వారాలు దగ్గు ఉన్నట్లయితే తెమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలు, నివారణపై స్థానికులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట ముత్తారం ప్రభుత్వ వైద్యుడు అమరేందర్‌రావు, తదితరులున్నారు.

చట్టాలపై ప్రతీ ఒక్కరికి   అవగాహన ఉండాలి1
1/3

చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి

చట్టాలపై ప్రతీ ఒక్కరికి   అవగాహన ఉండాలి2
2/3

చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి

చట్టాలపై ప్రతీ ఒక్కరికి   అవగాహన ఉండాలి3
3/3

చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement