
ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి
ఆహారం కోసం కోతులు ఇళ్లల్లో చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంట్లోకి వెళ్లాలంటే భయంగా ఉంది. మార్కండేయ కాలనీలోని రాజ్యలక్ష్మీ ఫంక్షన్హాల్ వద్ద కోతులు విపరీతంగా ఉన్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి.
– రాము,
గాంధీనగర్–గోదావరిఖని.
అడవులను సంరక్షించాలి
అడవులను సంరక్షించి, పండ్ల మొక్కలు నాటినట్లయితే కోతులు, వనం వదిలి జనంలోకి రావు. కోతుల బెడద నివారణకు అధికారులు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ డబ్బుతో అడవులు అంతరించిపోకుండా సంరక్షించాలి. అడవుల్లో ఎక్కువగా నీటి గుంతలు నిర్మించాలి.
– పిట్టల రాజ్కుమార్, గోదావరిఖని
ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం
నగరంలో కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రూ.10లక్షలతో టెండర్ పిలిచి, ఓ ఏజెన్సీకి పనులు అప్పగించాం. రోజూ ఎన్ని కోతులు పట్టి తిరిగి ఎక్కడ వదిలేస్తున్నారన్న దానిపై పర్యవేక్షణ చేపడుతున్నాం. కాల్ సెంటర్లో ఫిర్యాదులు అందించాలి.
– జె.అరుణశ్రీ, బల్దియా కమిషనర్ (ఎఫ్ఏసీ)

ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి

ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి