
పరిసరాల పరిశుభ్రత ప్రతీఒక్కరి బాధ్యత
కోల్సిటీ(రామగుండం): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతీఒక్కరి బాధ్యత అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ అన్నారు. 15వ ఆర్థిక సంఘం టైడ్ నిధులు రూ.30లక్షల అంచనా వ్యయంతో కొనుగోలు చేసిన జేసీబీ మినీ ఎక్స్కవేటర్ యంత్రాన్ని, బల్దియా కార్యాలయంలో కమిషనర్ (ఎఫ్ఏసీ) జె.అరుణశ్రీతో కలిసి గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రమైన సుందరనగరంగా తీర్చిదిద్దే క్రమంలో, పారిశుద్ధ్య నిర్వహణ పటిష్టంగా చేపట్టడానికి ఆధునిక యంత్రాలు కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాలువలు, రోడ్లపై చెత్త వేయొద్దని, మున్సిపల్ వాహనాలకు చెత్త అందించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీవీ రామన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, మాజీ కార్పొరేటర్లు మహంకాళిస్వామి పాల్గొన్నారు.
పారదర్శకం.. ఇందిరమ్మ పథకం
రామగుండం: ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం పారదర్శకంగా అమలు చేస్తామని, నిర్దేశిత గడువులోగా ఇంటి నిర్మాణం చేపడితే దశల వారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు డబ్బులు జమవుతాయని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ అన్నారు. అంతర్గాం మండల కేంద్రంలో గురువారం 402 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ప్రొసీడింగ్స్, 194 మందికి రేషన్కార్డులు అందజేశారు. అంతర్గాం కేంద్రంగా అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మాణం కానుందన్నారు. పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ తూము రవీందర్పటేల్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ ప్రతినిధులు హాజరయ్యారు.
నూతన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం..
అంతర్గాం మండల పరిధిలోలో ఓల్టేజి నివారణలో భాగంగా నూతనంగా 33/11కేవీ సామర్థ్యం గల సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.2.29కోట్ల వ్యయంతో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కంకటి మాధవరావు, డీఈ వి.ప్రభాకర్, ఏడీఈ రమేశ్, ఏఈ ఆశ శంకర్ ఉన్నారు.
● ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ఠాకూర్