ఒక్కడే..! | - | Sakshi
Sakshi News home page

ఒక్కడే..!

Aug 31 2026 1:20 AM | Updated on Aug 31 2026 1:20 AM

ఒకే విద్యార్థితో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాల

గురువు

విద్యార్థి

పార్వతీపురం రూరల్‌: ఆ పాఠశాలలో అక్షరం ఒంటరైంది. పలకపట్టే పసివాడొక్కడే, దిద్దించే గురువొక్కడే కావడంతో ఆ విద్యాప్రాంగణం వెలవెలబోతోంది. పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలోని రెడ్డి వీధిలో ఉన్న మండల పరిషత్‌ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇది. ఈ బడిలో ప్రస్తుతం ఉపాధ్యాయుడు గౌరినాయుడు విధులు నిర్వర్తిస్తుండగా.. మేకల అరవింద్‌ (రెండవ తరగతి) అనే ఒకే ఒక్క విద్యార్థి విద్యాభ్యాసం చేస్తున్నాడు. గతేడాది విద్యా సంవత్సరంలో ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఉండేవారు. ఈ పాఠశాలలో కేవలం రెండవ తరగతి వరకే బోధన ఉండడంతో, మూడవ తరగతికి వచ్చిన మరో విద్యార్థి వేరే బడికి వెళ్లాడు. దీంతో అరవింద్‌ ఒక్కడే మిగిలాడు. రెండేళ్ల క్రితం వరకు సరిపడా విద్యార్థులతో కళకళలాడిన ఈ బడిలో, క్రమంగా పిల్లల సంఖ్య పడిపోవడం గమనార్హం. నానాటికీ హాజరు క్షీణించి, బడిలో పిల్లాడొక్కడే మిగలడంతో గ్రామస్తుల్లో గుబులు మొదలైంది. పాఠశాలలో ఒక్కగానొక్క విద్యార్థే ఉన్న దృష్ట్యా. ఎక్కడ ప్రభుత్వం తమ వీధిలోని బడిని మూసివేస్తుందోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement