రైతు సమస్యపై రాజకీయం వద్దు | - | Sakshi
Sakshi News home page

రైతు సమస్యపై రాజకీయం వద్దు

Jun 27 2025 4:41 AM | Updated on Jun 27 2025 4:49 AM

వీరఘట్టం: మండలంలోని పాలమెట్ట గ్రామంలో నాగావళి నదికి అనుసంధానంగా ఉన్న ఓపెన్‌ హెడ్‌ చానల్‌ పనులు చేపట్టేందుకు ఓ రైతుగా తాను వచ్చానని, రైతు సమస్యను రాజకీయం చేయవద్దని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ కోరా రు. బొడ్డగెడ్డ వద్ద పాలమెట్ట–నీలానగరం ఓపెన్‌ హెడ్‌ చానల్‌ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది రైతు సమస్య. మా పూర్వీకుల నుంచి ఏటా ఖరీఫ్‌ సమయంలో కాలువ నిర్వహణను ఓ వ్యక్తికి అప్పగిస్తున్నామని అధికార యంత్రాంగానికి, మీడియాకు తెలియజేశారు. ఓపెన్‌హెడ్‌ చానల్‌ కింద బిటివాడ, కుమ్మరిగుంట, నీలానగరం, ఎంవీ పురం, పనసనందివాడ, తలవరం గ్రామాల రైతులకు చెందిన 2,500 ఎకరాల ఆయకట్టు ఉందని, ఏటా రైతులు సంయుక్తంగా ఈ కాలువను బాగుచేసుకుని పంట పొలాలకు సాగునీరు అందేలా చేసుకుంటున్నారన్నారు. కూటమి నేతలు కాలువ పనులు చేపట్టనీయకుండా రెండు రోజులుగా ఈ ప్రాంత రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

అరకొరగా పనులు చేపట్టి..

ఇటీవల పాలమెట్ట–నీలానగరం ఓపెన్‌ హెడ్‌ చానల్‌ పనులను రూ.11 లక్షల ఖర్చుతో అరకొరగా చేపట్టి నిధులను పక్కదోవ పట్టించి రైతులను కూటమి నేతలు మోసగిస్తున్నారని ఎమ్మెల్సీ విక్రాంత్‌ ధ్వజమెత్తారు. ఈ ప్రాంత రైతులు తమ పంట కాలువను తామే బాగు చేసుకుంటామంటే ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారని ప్రశ్నించారు. అంతకు ముందు బిటివాడ, కుమ్మరిగుంట, నీలానగరం, ఎంవీ పురం, పనసనందివాడ, తలవరం గ్రామాల రైతులతో కలిసి టెంకాయలు కొట్టి కాలువ పనులను ఎమ్మెల్సీ విక్రాంత్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ దమలపాటి వెంకటరమణనాయుడు, వీరఘట్టం జెట్పీటీసీ జంపు కన్నతల్లి, వైస్‌ ఎంపీపీ పర్రి విజయకుమారి, వైఎస్సార్‌సీపీ నాయకులు నిష్టల సన్యాసిరావు భుక్త, పాలవలస నందకుమార్‌, పొట్నూరు లక్ష్మ ణరావు, వావిలపల్లి పురుషోత్తమరావునాయుడు, శిష్టు మధుసూదనరావు, బౌరోతు రాజశేఖర్‌, దేవకివాడ భుజంగరావు, బెవర అప్పలనాయుడు, పన్నింటి శ్రీను, భుగత అమృతరావు, భోగి మణి, ఉత్తరావల్లి వెంకటరమణ, ఆరు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

భారీగా మోహరించిన పోలీసులు

పాలమెట్ట గ్రామంలో గురువారం తెల్లవారేసరికి పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. గామంలోకి వచ్చే ప్రతి ఒక్కరి ఫొటోను సెల్‌ఫోన్‌తో తీయడంతో ఏం జరుగుతోందోనని ఆందోళన చెందారు. ఎమ్మెల్సీ విక్రాంత్‌ రైతులతో కలిసి పాలమెట్ట ఓపెన్‌ హెడ్‌ చానల్‌ పనులు ప్రారంభించేందుకు వస్తున్నారని, బందోబస్తుకు వచ్చామని పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. చానల్‌ పనుల ప్రారంభ కార్యక్రమం ప్రశాంతంగా జరగడంతో ఊపిరిపీల్చుకున్నారు.

ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ విజ్ఞప్తి

పాలమెట్ట ఓపెన్‌హెడ్‌ చానల్‌

పనులకు శ్రీకారం

మద్దతు పలికిన ౖరైతాంగం

రైతు సమస్యపై రాజకీయం వద్దు1
1/2

రైతు సమస్యపై రాజకీయం వద్దు

రైతు సమస్యపై రాజకీయం వద్దు2
2/2

రైతు సమస్యపై రాజకీయం వద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement