
చిన్నబగ్గ ఆశ్రమ పాఠశాల సమీపంలో ఏనుగులు
సీతంపేట: మండలంలోని చిన్నబగ్గ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నట్లు గిరిజనులు తెలిపారు. గోరపాడు కొండల్లో బుధవారం తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు కొండ దిగి చిన్నబగ్గవైపు వచ్చి ఆశ్రమపాఠశాలకు కొద్దిదూరంలో ఉన్న జీడితోటల్లో ఘీంకరిస్తున్నాయి. అటువైపు ఎవ్వరూ వెళ్లవద్దని అటవీశాఖ ఎఫ్బీవో కె. దాలినాయుడుతో పాటు ట్రాకర్లు సూచిస్తున్నారు.
విద్యార్థుల ప్రవేశాలు మరింత పెరగాలి
కొమరాడ: గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమి క పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు గత ఏడా ది కంటే మరింత పెరగాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఉపాధ్యాయులతో అన్నారు. ఈ మేర కు గురువారం ఆయన కొమరాడ మండలంలోని అంకుళ్లవలస, రావి కర్రివలస గ్రామాల్లో గల గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి ఆకస్మికంగా సందర్శించా రు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి వారితో ముచ్చటించారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను అందివ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పీఎస్ల హేతుబద్ధీకరణకు సలహాలివ్వండి
పార్వతీపురం టౌన్: జిల్లాలోని పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు తగిన సలహాలు ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులను కోరా రు. అలాగే ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితాను తయారు చేయడంలో బీఎల్ఓలతో సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువా రం ఆమె తన చాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా డీఈఓ లేదా ఈఆర్ఓ స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయమై ఈసీ జారీ చేసే నియమాలు, మార్గదర్శకాలపై తగిన సలహాలను జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నుంచి కోరుతున్నట్లు ఆమె చెప్పారు. ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా ను తయారు చేయడంలో బీఎల్ఓలకు సహకరించాలని, ఇందుకు గుర్తింపు పొందిన రాజకీ య పార్టీలు ప్రతి పోలింగ్ స్టేషన్కు బూత్ లెవె ల్ ఏజెంట్ను నియమించాలని సూచించారు.

చిన్నబగ్గ ఆశ్రమ పాఠశాల సమీపంలో ఏనుగులు

చిన్నబగ్గ ఆశ్రమ పాఠశాల సమీపంలో ఏనుగులు