ఈఈను నేను.. కాదు నేను..! | - | Sakshi
Sakshi News home page

ఈఈను నేను.. కాదు నేను..!

Jun 27 2025 4:41 AM | Updated on Jun 27 2025 4:41 AM

ఈఈను

ఈఈను నేను.. కాదు నేను..!

● ఇద్దరు ఈఈల మధ్య కుర్చీలాట ● ప్రభుత్వం నియమించిందని ఒకరు, కోర్టు జీఓ సస్పెండ్‌ చేసిందని మరొకరు.. ● ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజినీరింగ్‌ ఈఈ పోస్టుపై నెలకొన్న ఉత్కంఠ

సీతంపేట:

సీతంపేట ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ శాఖలో ఈఈ (ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌) పోస్టుపై ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు ఈఈల మధ్య గురువారం కుర్చీలాట కొనసాగింది. కార్యాలయంలో వేర్వేరు కుర్చీల్లో ఇద్దరు కూర్చోవడంతో ఎవరు తమ ఈఈ అన్న ప్రశ్న కిందిస్థాయి ఉద్యోగుల్లో తలెత్తింది. కార్యాలయానికి వచ్చేవారు ఎవరికి రిపోర్టు చేయాలో తెలియక సందిగ్దంలో పడ్డారు. వివరాలు పరిశీలిస్తే.. ఏడు నెలల కిందట సీతంపేట ఈఈ పోస్టు ఖాళీగా ఉండడంతో రమాదేవిని నియమించా రు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఈ నెల 9న ఆమె స్థానంలో కె.వి.ఎస్‌.ఎన్‌ కుమార్‌ను ఇక్కడ నియమించి రమాదేవిని నెల్లూరుకు బదిలీ చేశారు. ఈ నెల 11న కుమార్‌ సీతంపేట ఈఈగా బాధ్యతలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు స్వీకరించిన ఏడు నెలలకే తనను బదిలీ చేశారంటూ రమాదేవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బదిలీ జీఓను హైకోర్టు ఆరు వారాల పాటు సస్పెండ్‌ చేసింది. కోర్టు ఆదేశాలతో తను ఇక్కడే ఈఈగా కొనసాగుతున్నట్టు రమాదేవి స్పష్టం చేశారు. ప్రభుత్వ బదిలీ జీఓ ప్రాప్తికి తనుకూడా ఇక్కడే ఈఈగా విధులు నిర్వహిస్తున్నట్టు కుమార్‌ తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.

ఈఈను నేను.. కాదు నేను..! 1
1/2

ఈఈను నేను.. కాదు నేను..!

ఈఈను నేను.. కాదు నేను..! 2
2/2

ఈఈను నేను.. కాదు నేను..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement