
రోడ్డు ఇలా.. బడికెళ్లేదెలా?
చిత్రంలో పెద్దపెద్ద గుంతలతో బురదమయంగా కనిపిస్తున్నది జియ్యమ్మవలస మండలం పరజపాడు– పెదకుదమ రోడ్డు. చినుకుపడితే చాలు చిత్తడిగా మారుతోంది. ఈ రోడ్డుపై రాకపోకలకు పరజపాడు, లక్ష్మీపురం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు నరకం చూస్తున్నారు. రోడ్డు బాగుచేయాలంటూ కూటమి నేతలను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వర్షం కురిస్తే బడికి వెళ్లాలంటేనే భయం వేస్తోందన్నారు. పక్కా రోడ్డు నిర్మించాలని సర్పంచ్ పలు సార్లు మండల సర్వసభ్య సమావేశాల్లో మెరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. – జియ్యమ్మ వలస రూరల్