
గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురం: గ్రామసర్వేయర్లు ఎదుర్కొంటున్న స మస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్కు ర్యాలీగా వచ్చి కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స ర్వేయర్ల సంఘం నాయకుడు ఉదయ్ కుమార్ మా ట్లాడుతూ ఐదేళ్ల సర్వీసు పూర్తయినప్పటికీ రేషనలైజేషన్లో కానీ, బదిలీ ప్రక్రియనులోకానీ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. గ్రామ సర్వేయర్లుగా ఉన్న తమకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గరుగుబిల్లి, పార్వతీపురం, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట తదితర మండలాల నుంచి సర్వేయర్లు పాల్గొన్నారు.
కలెక్టర్కు వినతిపత్రం అందజేత