
గురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2025
● ఏది రాజకీయం.. చేయించిందెవరు?
● పెదపెంకి పిల్లల ప్రమాద ఘటనను ‘డైవర్షన్’ చేసేందుకు ప్రయత్నం
● మంత్రి లోకేశ్కు ‘ఎక్స్’లో పోస్టు చేసింది టీడీపీ కార్యకర్త శ్యామ్
● ఎమ్మెల్యే విజయచంద్రకు
అనుచరుడిగా గుర్తింపు
● వాస్తవాలు బయటకు రావడంతో ‘తప్పు’ను కప్పిపుచ్చే యత్నం
న్యూస్రీల్
ఇదీ రాజకీయమే అందామా?
ఆటో ప్రమాద ఘటనలో గాయపడిన చిన్నారులకు ఆర్థిక సహాయం నిమిత్తం టీడీపీ నాయకులు బుధవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున నగదు అందించారు. కొద్ది రోజులుగా పిల్లలు పోరాటం చేస్తున్నా, తమకేమీ తెలియదన్నట్లు చెబుతున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు.. వారి సమస్య వినే తీరిక లేని నేతలు.. పిల్లలకు ప్రమాదం జరిగితే పరామర్శ చేయడం, ఆర్థిక సాయం అందించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మానవతాదృక్పథంతో ఆ మొత్తం ఇచ్చారా.. లేకుంటే తాము వేసిన స్కెచ్ పారలేదనీ.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తల్లిదండ్రులను మభ్యపెట్టడానికే ఇచ్చారా.. దీన్నీ రాజకీయమే అనుకోవాలా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే సొంత గ్రామమైన నర్సిపురంలో ప్రమాదం జరిగితే.. ఏ ఒక్కరైనా ఎందుకు పరామర్శకు వెళ్లలేదని, ఇప్పుడే ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.

గురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2025